హైదరాబాద్ : ఎటిఎంలో నగదు లోడ్ చేసే ఉద్యోగి డబ్బులు లోడ్ చేయకుండా రూ.50లక్షలతో పరారయ్యాడు. చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలో ఉద్యోగి పరారైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఎటిఎం డబ్బులు చోరీకి గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటిఎంలో డబ్బులు లోడ్ చేసే ఉద్యోగుల వివరాలు తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వెళ్లే రూట్లో సిసికెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా ఆచూకీ తెలిసింది. గతంలో రూ.20లక్షలతో పరారైన ఉత్తరప్రదేశ్కు చెందిన ఉద్యోగిని నగర పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. డబ్బుతో పరారైన వ్యక్తి వెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఆ కారు యజమానిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆ వ్యక్తి దిగినట్లు కారు డ్రైవర్ విచారణలో తెలిపాడు.