Sunday, April 28, 2024

దాసరి కుమారుడిపై అట్రాసిటీ కేసు

- Advertisement -
- Advertisement -
Atrocities Case Against Dasari Narayana Rao's Son
కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్: ఒప్పందం ప్రకారం పనిచేయించుకుని డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో దివంగత సినీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బొల్లారానికి చెందిన బ్యాగరి నరసింహులు వెంకటేష్ అనే వ్యక్తి దాసరి నారాయణ రావు వద్ద టెక్నీషియన్‌గా 2012 నుంచి 2016వరకు మూవీ రిసోర్స్ ఔట్ సోర్సింగ్ పనులు చేశాడు.

దాసరి మృతిచెందిన తర్వాత ఆయన కుమారులు దాసరి అరుణ్, ప్రభుతో ఒప్పందం చేసుకుని పనిచేయించుకున్నారు. వెంకటేష్ చేసిన పనులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. డబ్బులు అడిగితే ఒప్పందంపై తాను సంతకం చేయలేదని, డబ్బులు ఇవ్వనని చెప్పాడు. ఈ నెల 13 వతేదీన ఎఫ్‌ఎంసిసికి రమ్మని చెప్పడంతో బాధితుడ తన స్నేహితుడు చక్రపాణిని తీసుకుని వెళ్లాడు. అక్కడ అరుణ్‌కుమార్ తనకు డబ్బులు ఇవ్వకుండా కులం పేరుతో దూషించాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Atrocities Case Against Dasari Narayana Rao’s Son

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News