Wednesday, May 15, 2024

కళ్లలో కారం పొడి చల్లి…. ఆటో డ్రైవర్ హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆటో డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆటో డ్రైవర్ మధుపై దుండగులు కళ్లలో కారం పొడి చల్లారు. అనంతరం అతడిని మారణాయుధాలతో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు డిఎస్‌పి రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసును చేధించడానికి ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్‌ఐలను నియమించారు. ఘటనా స్థలం నుంచి మారణాయుధాలు, నిందితుల పాదరక్షకాలు, కారం పొడిని స్వాధీనం చేసుకున్నారు. హతుడితో గొడవ ఉన్న వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధాలు కూడా హత్యకు దారి తీయోచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News