ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడుతోంది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,32,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 2713 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.85 కోట్లకు చేరుకోగా 3.40 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 2.65 కోట్ల మంది కోలుకోగా 16.35 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 2.07 లక్షల మంది కోలుకున్నారు. 22.41 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 35.4 కోట్ల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -