Thursday, May 2, 2024

ఒకే వేదికపై తల్లీ కూతుళ్లకు అవార్డులు ప్రదానం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ: ఒకే వేదికపై తల్లీ కూతుళ్లకు అవార్డులు వరించాయి. మయూరి ఆర్ట్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు అవార్డులు అందుకున్నారు. ప్రముఖ సంఘ సేవకురాలు పొలిమేర జయలక్ష్మి(విజయ నగరంలోని పిళ్లా సత్యారావు కుమార్తె) ప్రతిభను గుర్తించి అవార్డు అందజేశారు. ఇంటర్నేషనల్ కూచిపూడి, ఫోక్ డ్యాన్స్‌ర్ (జయలక్ష్మి కుమార్తె)పొలిమేర పరిణితకు ఇండియన్ హానరబుల్ అవార్డును ‘మా’ అసోసియేషన్ సభ్యులు, సినీ నటుడు పసునూరి శ్రీనివాసులు,

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. కరోనా సమయంలో అనేక మందికి తన వంతు సహాయ సహ కా రాలు అందించామన్నారు. సామాజిక, సాంస్కృతిక రంగాలల్లో తాము చే స్తున్న సేవలను గుర్తించి అవార్డును అందజేయడం చాలా సంతోషంగా ఉం దని సంస్థ నిర్వాహకులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News