Thursday, May 2, 2024

భారత స్విమ్మింగ్ కోచ్‌గా ఆయూష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ వేసవి క్రీడల్లో పాల్గొంటున్న భారత స్విమ్మింగ్ జట్టు ప్రధాన కోచ్‌గా తెలంగాణకు చెందిన ఆయూష్ యాదవ్ ఎంపికయ్యాడు. బెర్లిన్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో ప్రపంచా వ్యాప్తంగా 150కి పైగా దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో భారత స్విమ్మింగ్ టీమ్ హెడ్ కోచ్‌గా గచ్చిబౌలి శాట్స్ స్విమ్మింగ్ అకాడమీకి చెందిన ఆయూష్ వ్యవహరించనున్నాడు. ఇదిలావుంటే ఈ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం భారత బృందం బెర్లిన్ బయలుదేరి వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News