Friday, April 19, 2024

40కి పైగా రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలో రైలు ప్రమాదం దృష్టా 40 కి పైగా రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్‌పూర్‌లో ఉన్న చెన్నై సెంట్రల్ హావ్‌డా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. అలాగే వాస్కోడగామా షాలీమార్ (18048) రైలును కటక్ మీదుగా పంపించారు.

సికింద్రాబాద్ షాలిమార్ వీక్లీ (22850) రైలును కటక్ మీదుగా నడుపుతున్నారు. హావ్‌డా పూరీ సూపర్‌ఫాస్ట్ (12837), హావ్‌డా బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12863), హావ్‌డా చెన్నై మెయిల్ (12839), హావ్‌డా సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20831) రైళ్లను రద్దు చేశారు. ప్రధాని చేతుల మీదుగా శనివారం జరగాల్సిన గోవాముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం కూడా రద్దయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News