Sunday, April 28, 2024

కెసిఆర్ ప్రభుత్వం.. భూములమ్మి జీతాలిస్తోంది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

బిజెపి చేస్తున్న దీక్షతో నిరుద్యోగులకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్కార్ చేసిన మోసాల బండారం బయటపడుతుందనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మండపడ్డారు. కరీంనగర్ లోని తన నివాసంలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. “రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి కార్యకర్తలపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇవ్వడానికి కూడా సొమ్ము లేకపోవడంతోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగుల పొట్టకొడతారా?. భూములను అమ్మి జీతాలిచ్చే దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. రాష్రాన్ని రూ.5.5లక్షల కోట్ల అప్పుల పాల్జేశారు. కేసీఆర్ చెల్లని రూపాయిలా మారారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే అప్పులెలా తీరుస్తారో సమాధానం చెప్పాలి?. కేసీఆర్ కు బిజెపి అంటేనే భయం వేస్తోంది. అందుకే కాంగ్రెస్ ను జాకీ పెట్టి లేపే కుట్ర చేస్తున్నడు. కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోక రాదు… అందుకే అడ్డగోలు హామీలతో ఆకట్టుకోవాలనుకుంటున్నారు.

రాష్ట్రంలో కౌలు రైతుల గురించి ఎందుకు ఏ పార్టీ పట్టించుకోవడం లేదు?. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు?. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కేంద్రాన్ని బదనాం చేయడం, మోసపూరిత హామీలివ్వడం, కాంగ్రెస్ ఇమేజ్ పెంచడమే పనిగా కేసీఆర్ పెట్టుకున్నడు. ఒవైసీ చెబితేనే సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా కేసీఆర్ ప్రకటించారు. ఒవైసీతో ప్రేమ చిహ్నానికి గుర్తుగా దారుస్సలాంలో జాతీయ సమైక్యతా ఉత్సవాలు చేసుకోండి. తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాం రాజు గొప్పోడా?. కేసీఆర్ సీఎం కాగానే నిజాం రాజు అరాచకాలన్నీ మర్చిపోయి ఆయన సమాధి వద్ద మోకరిల్లుతావా?. నిజాం ఆస్తులపై కేసీఆర్ ద్రుష్టి పడింది.. అందుకే ఆయనను గొప్పోడిగా చిత్రీకరిస్తూ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను విస్మరిస్తున్నాడు.

Also Read: సిఎం కెసిఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం: తలసాని

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి తీరాల్సిందే. కేసీఆర్ కు చేతగాకపోవడంవల్లే కేంద్రమే అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తోంది. జమిలి ఎన్నికలంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకు?. ప్రదాని మోడీ ఛరిష్మా ముందు బీఆర్ఎస్ వన్నీ నల్లముఖాలే. జమిలీ ఎన్నికలొస్తే… బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు కూడా రావు. జమిలీ ఎన్నికలపై అధికారిక నిర్ణయం వెలువడకముందే ఎందుకంత తొందర?. తప్పుడు ప్రచారం చేసేటోళ్లు మూర్ఖులు. ఎంపి, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే నేను కరీంనగర్ అసెంబ్లీ నుండే పోటీ చేస్తా. కరీంనగర్ లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు హేయనీయం. కరీంనగర్ లో గంజాయి ఏరులై పారిస్తూ యువతను చిత్తు చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు?. అధికార పార్టీ నేతలే గంజాయిని ఏరులై పారిస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు.

పోలీసులు గంజాయిని కంట్రోల్ చేస్తారా? లేదా?. లేనిపక్షంలో మేమే యువకులతో టీంలను ఏర్పాటు చేసి గంజాయి అమ్మేటోళ్లను పొట్టుపోట్టుగా కొట్టిస్తా. చిన్న చిన్న పిల్లలను కూడా గంజాయికి అలవాటు చేస్తే చూస్తూ ఊరుకుంటారా?. మీ పిల్లలు గంజాయికి అలవాటైనా ఇట్లనే మౌనంగా ఉంటారా?. నాతోసహా బీజేపీ నేతలంతా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాం. గంజాయి అమ్మకాల్లో ఏ పార్టీ నాయకులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అధికార పార్టీ నేతలు పైసలతో నాయకులను, ఓట్లను కొంటున్నారు. పైసలకు తాత్కాలికంగా అమ్ముడు పోయినా వాస్తవాలు తెలుసుకుని వాళ్లంతా తిరిగి మాతోనే రావడం ఖాయం” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News