Thursday, May 2, 2024

మొయినాబాద్ లో జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : ప్రముఖ క్రీడాకారిని జ్వాల గుత్తా మొయినాబాద్ అకాడమీలో అండర్ 15,17 ఏళ్ల బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జ్వాలా గుత్తా, బారత జాతీయ బ్యాట్ మెంటెన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బిస్వా, బ్యాట్ మెంటెన్ అసోషియేషన్ కోశాధికారి వంశి, శాట్ ఎండీ లక్ష్మి, తెలంగాణ అకాడమీ బాబు దేశంలోని 33 రాష్ట్రాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

దేశంలోనే మహోన్నతంగా తెలంగాణ లో క్రీడా పాలసీ రానుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో 18 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. గతంలో పివి సింధు, సానియా మీర్జా ఇలాంటి క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహించింది.  మంత్రి కెటిఆర్ సహకారంతో జ్వాలా గుత్తా అకాడమి ప్రారంభించారు. క్రీడా పాలసీ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘంలో పలు అంశాలను చర్చించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగే విధంగా పాఠ్యాంశాలలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News