Saturday, April 27, 2024

బండి నా తల్లి పుట్టుక గురించి మాట్లాడారు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంపి బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.  ఐదు సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎం చేసారని ప్రశ్నించారు. బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ రీకౌంటర్ ఇచ్చారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల ఆడడం కాదని, బండి నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తాను ఎన్నడూ రాముడి పట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడలేదని, తన తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారని, ఇది ఎంత వరకు సమంజసం అని సభ్య సమాజాన్ని కొరుతున్నామని, జన్మనిచ్చిన తల్లి నా తల్లి అయిన..ఇంకా ఎవరి తల్లి అయిన తల్లేనని చెప్పారు. రాజకీయంగా అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించినది అయితే అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మకు సంబందించిన మాట అని మండిపడ్డారు.

సమాజం గమనించాలని, రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్రని కొనసాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. బండి యాత్రకి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలేపాడని, బిజెపి యాత్రలను తాము అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉందని, మీరు మాట్లాడిన మాటలపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అంటున్నామని,  ప్రజస్వామ్యమే మనకు చట్టమని, ఈ ప్రజల ముందు తాను అడుగుతున్నానని, తన తల్లి జన్మ గురించి మాట్లాడుతున్న అతని పట్ల ఒకసారి ఆలోచన చేయాలన్నారు. భార్యకి మంగళ సూత్రం కడతారు..అటువంటి మంగళ సూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి బండి సంజయ్ కాదా? అని పొన్నం ప్రభాకర్ చురకలంటించారు.

శ్రీ రాముడు అంటే ఎంత గౌరవం ఉందని, ఆనాడు ఆయోధ్య రాముడిగా సీతమ్మ కోసం పడ్డ కష్టం తండ్రి మాటకు కట్టుబడి విలువిచ్చి పరిస్థితి గురించి మాట్లాడేది  వీళ్ళేనా అని ప్రశ్నించారు. తన తల్లి జన్మ గురించి మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలని, వాళ్ళని అడుగుతున్న ఇటువంటి నాయకునికి డ్రామాలకు సమర్థిస్తున్నారా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుని అడుగుతున్న ఈ జిల్లాకి సంబంధించిన బిజెపి నాయకులను అడుగుతున్నానని, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో మీరేం చేశారని, తాను ఎంపిగా ఉన్నప్పుడు తానేం చేశాను అని ప్రజలు గమనించాలన్నారు.

నియోజకవర్గాల్లో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మాట ఆనాడు కెసిఆర్ హిందుగాల్లు బొందుగాళ్ళు అంటే రాజకీయంగా ఎన్నికల్లో ఏవిధంగా వాడుకున్నారో తెలియని విషయం కాదా? అని గుర్తు చేశారు. తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్ ను హెచ్చరించారు. తాము హింసావాదులం కాదని, శవం మీద పేలాలు ఏరుకునే రకం కాదు యాత్ర చేసుకో ఏమైనా చేసుకో అని సూచించారు. తాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని, తాము యాత్రకి అడ్డుపడతలేమని, నాలుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బండి సంజయ్ అని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News