Saturday, April 27, 2024

అక్టోబర్ 4న ‘భగవంత్ కేసరి’ సెకండ్ సింగిల్

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ డెడ్లీ కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి. టీజర్‌ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వరకు ప్రమోషనల్‌ మెటీరియల్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మాస్ ఫీస్ట్ తర్వాత, ఎమోషనల్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.

ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ఉయ్యాలో ఉయ్యాలా అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ పాట  భగవంత్ కేసరి బంధాన్ని నిర్వచిస్తుంది. పోస్టర్‌ లో బాలకృష్ణ నది ఒడ్డున కూర్చుని పాపతో సరదాగా గడుపుతున్నట్లు కనిపించింది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News