Friday, April 26, 2024

పదో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పదో రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది.  ఇవాళ భారత్ జోడో యాత్ర చౌటకూర్ నుంచి ప్రారంభమైంది.  ఈ రోజు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు జోడో యాత్ర సాగనుంది.  జోడో యాత్రలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను రాహుల్ ఎండగడుతున్నారు. భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించినా ప్రధాని నరేంద్ర మోడీ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం కోసమే యాత్ర లక్ష్యమని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణలో మరో రెండు రోజుల్లో జోడో యాత్ర ముగియనుంది. ఇవాళ 21 కిలో మీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. దనపల్లి వద్ద భోజన విరామం, పెద్దాపూర్ లో కార్నర్ మీటింగ్, అల్లదుర్గ వద్ద రాత్రి బస చేయనున్నారు. కన్యాకుమారి నుంచి 58 రోజులుగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News