Friday, May 3, 2024

టిటిడి చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఉన్న బోర్డు పదవీకాలం ఆగస్టు 8న ముగియనున్న నేపధ్యంలో కొత్త పాలక వర్గం ఎంపికపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూమన 2006 నుండి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా పని చేశారు . వైఎస్సార్ జిల్లా, నందలూరు మండలం, ఈదరపల్లెలో జన్మించిన భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతోపాటు ఎం.ఎ చదివారు. మహాత్ముడి ఆత్మకథ సత్యశోధనను భూమన ప్రత్యేక శ్రద్ధతో పునర్ముద్రించారు.
రాజకీయ ప్రస్థానం:
భూమన కరుణాకర్‌రెడ్డి తొలినుంచి రాజకీయాల్లో డాక్టర్ వైఎస్సార్‌కు సన్నిహితంగా ఉండేవారు. 2012లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తిరుపతి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో (జులై 2023లో) భూమనను రాష్ట్ర ప్రభుత్వం సభా హక్కుల కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News