Tuesday, May 7, 2024

2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల నుంచి బిజెపికి రూ.1300 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1300 కోట్ల నిధిని సమకూర్చుకోగలిగింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల కన్నా ఇది ఏడు రెట్లు ఎక్కువ. 2022 23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.2120కోట్లు కాగా, అందులో 61 శాతం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయని ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిక వెల్లడించింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1775 కోట్లు. 2021-22 నాటి ఆదాయం రూ.1917 కోట్లు కన్నా 2022-23లో మొత్తం ఆదాయం రూ.2366.8 కోట్ల వరకు అధిగమించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే ఆ పార్టీకి 2021-22లో రూ.236 కోట్లు ఆదాయం రాగా, 2022-23 నాటికి రూ.171కోట్ల వరకు తగ్గింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొందిన సమాజ్‌వాది 2021-22లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్ల వరకు విరాళాల మొత్తం ఆదాయాన్ని పొందగలిగినప్పటికీ, 2022-23 నాటికి ఈ బాండ్ల నుంచి ఎలాంటి విరాళాలు పొందలేక పోయింది.

మరో రాష్ట్ర స్థాయి పార్టీ టీడీపీ 2022-23లో రూ.34 కోట్లు ఆర్జించగా, అంతకు ముందు సంవత్సరం కన్నా పది రెట్లు ఎక్కువగానే పొందగలిగింది. వడ్డీల రూపంలో బీజేపీ 2021-22లో రూ.135 కోట్లు పొందగా, 2022-23లో రూ.237 కోట్ల వరకు ఎక్కువగా సాధించగలిగింది. ఎన్నికలు, ప్రచారానికి సంబంధించి విమానాలు, ఎయిర్ క్రాఫ్ సర్వీస్‌ల కోసం 2021-22లో రూ.117.4 కోట్లు బీజేపీ చెల్లించగా, 2022-23లో ఆ సర్వీస్‌ల కోసం కేవలం రూ.78.2 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతకు ముందుకన్నా ఈ ఖర్చు బాగా తగ్గింది. బీజేపీ తన అభ్యర్థులకు 2021-22లో రూ.146.4 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించగా, 2022-23లో ఆ సాయం కేవలం రూ.76.5 కోట్లు మాత్రమే పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News