Sunday, April 28, 2024

పట్టపగలే బిజెపి నేతను కాల్చి చంపారు…

- Advertisement -
- Advertisement -

మొరాదాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీజేపీకి చెందిన స్థానిక రాజకీయ నాయకుడు అనుజ్ చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. మరో వ్యక్తితో కలిసి తన ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డులో ఈ దాడి జరిగింది. ముగ్గురు హంతకులు మోటార్‌సైకిల్‌పై వెంబడించి కాల్పులు జరిపారు.

దీంతో అనూజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోస్టుమార్టం అనంతరం అతడి శరీరంలోకి చాలా బుల్లెట్లు చేరినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజకీయ ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటనలో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను కనిపెట్టి అరెస్టు చేసేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News