Monday, May 13, 2024

దిమ్మె తిరిగేలా ప్రజాసంగ్రామం సృష్టిద్దాం : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దరఖాస్తులు, దండం పెట్టడాలు ఈ ప్రభుత్వాన్ని సరిపోవు, దిమ్మ తిరిగేలా ప్రజాసంగ్రామం సృష్టించాలి.. దానికి నేను నాయకత్వం వహిస్తానని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బిజెపి కార్యాలయం ప్రారంభోత్సవ, విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముచ్చర్ల ఫార్మా సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 19 వేల ఎకరాలు నిర్ధాక్షిణ్యంగా గుంజుకుంటుందన్నారు.

ముఖ్యమంత్రి పదవి మన ఓట్లకు పుట్టింది.. భూమి ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆనాడు అన్నవాడు… ఎన్ని ఎకరాలు దళితులకు, గిరిజనులకు ఇచ్చావో చెప్పగలగే దమ్ము ఉందా? ఆయన ప్రశ్నించారు. బిజెపి నేత ఆచారిని కాపాడేది ధర్మం, కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజల మీద ఉంది. ఈ దఫా గెలుపు మనదే.. అందుకు మా వంతు పాత్ర ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News