Thursday, May 2, 2024

దుండగుల దాడిలో గాయపడిన కౌన్సిలర్ భర్త మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుండగుల దాడిలో గాయపడిన కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజం కరీంనగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  మంగళవారం ఉదయం కోరుట్లలో హోటల్  ముందు నిలబడి ఉన్న కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజం పై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కౌన్సిలర్ భర్తను స్థానికులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి పరారిలో ఉన్న దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News