Wednesday, May 8, 2024

బుగ్గయ్యగౌడ్ సేవలు చిరస్మరణీయం

- Advertisement -
- Advertisement -
  • టిపిసిసి సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్

కడ్తాల్: ఆమనగల్లు మాజీ ఎంపిపి పాలకూర్ల బుగ్గయ్యగౌడ్ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కడ్తాల మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో బుగ్గయ్యగౌడ్ రెండవ వర్థంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఘాట్ వద్ద ఎంపిపి దేపావత్ కమ్లీమోత్యనాయక్, జెడ్పిటిసి జర్పుల దశరథ్‌నాయక్, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ్మ, కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, ఎంపిటిసిలు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, అద్దాల రాములు, లచ్చిరాంనాయక్, ప్రియా రమేష్, డిసిసి ఉపాధ్యక్షులు బీక్యనాయక్, ఐక్యతా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరప్రసాద్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బీచ్యనాయక్, సింగల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, దారెడ్డి అభినవన్‌రెడ్డి, కె.చందోజీ, గిరిజన నాయకులు హన్మనాయక్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాలకు అతీతంగా బుగ్గయ్యగౌడ్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాలకూర్ల రవికాంత్‌గౌడ్, సర్పంచ్ జంగం సుగుణసాయిలు, ఎంపిటిసి పాలకూర్ల ఉమావతి, యాదయ్యగౌడ్, ఈర్లపల్లి పాండు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News