Tuesday, April 30, 2024

శామీర్‌పేట్ లో బైక్ ను ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి… బస్సు దగ్ధం

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం కొత్తూరు వద్ద బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న సంపత్ కుమార్ మృతి చెందాడు. బైక్ ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో బస్సు పూర్తి దగ్ధమైంది. ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్ తప్పించుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News