Thursday, May 2, 2024

పిపిలీలో 68 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

Bypoll to Odisha'a Pipili assembly seats

పిపిలీ : ఒడిశాలోని పూరీ జిల్లాలో పిప్లీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. గురువారం జరిగిన ఈ ఘట్టంలో సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌కె లోహనీ తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగలేదని సిఇఒ చెప్పారు. అయితే కొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో కొద్ది సేపు ఇవిఎంలు మొరాయించాయి. గత ఏడాది అక్టోబర్‌లో బిజెడి ఎమ్మెల్యే ప్రదీప్ మహారథీ మృతి చెందడంతో ఉప ఎన్నికకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News