Tuesday, April 30, 2024

కంటోన్మెంట్ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హైదరాబాద్ శివారులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా, సిద్దిపేట మార్గంలో కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ కు చెందిన 94.20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్ర భుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండిఏ కమిషనర్ అరవింద్‌కుమార్‌తో వెళ్లి కలిసి ఐదు జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను వివరించినట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రితో కంటోన్మెంట్ భూమిని వెడల్పు చేసి జింఖానా గ్రౌండ్స్ నుంచి శామీర్ పేట మధ్యలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని, దీంతో సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉప యోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ది పేట జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకునే క్రమంలో హైదరాబాద్ శివారులో శా మీర్ పేట నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను అధి గమించేందుకు హకీంపేట – బొల్లారం – అల్వాల్ – తిరుమలగిరి – కార్ఖానా – జింఖానా గ్రౌండ్ మ ధ్యలో కంటోన్మెంట్ స్థలంలో రోడ్డును వెడల్పు చేసి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుముఖంగా ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలిపినట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చోట విలువైన భూమిని కంటోన్మెంట్ కు ఇచ్చేందుకు సిద్ద్దంగా ఉందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర రక్షణ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసిన విషయాన్ని తాను కూడా పార్లమెంట్ సమావేశాల్లో పలు మార్లు ప్రశ్నలు వేసిన విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వినోద్ కుమార్ గుర్తు చేశారు.

ఆ ఐదు జిల్లాల ప్రజలు హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే క్రమంలో హైదరాబాద్ శివారులో హకింపేట నుంచి ప్రారంభమయ్యే ట్రాఫిక్ సమస్య బొల్లారం, అల్వాల్, లోతుకుంట, లాల్ బజార్, తిరుమలగిరి, కార్ఖానా, జేబీఎస్, జింఖానా గ్రౌండ్స్ మధ్య కొనసాగుతోందని, ట్రాఫిక్ ఇక్కట్ల వల్ల ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వినోద్ కుమార్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరించడంజరిగిందన్నారు. ఐదు జిల్లా నుంచి హైదరాబాద్ శివారు వరకు ప్రయాణానికి పట్టే సమయం ఒక ఎత్తు అయితే శామీర్ పేట శివారు నుంచి హైదరాబాద్ నగరంలోకి చేరుకునే సమయం మరో ఎత్తుగా ఉంటుందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కి తెలపడం జరిగిందన్నా. ఐదు జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సులువుగా హైదరాబాద్ చేరుకునేందుకు శామీర్ పేట – హకీంపేట – బొల్లారం – అల్వాల్ – కార్ఖానా – తిరుమలగిరి – జింఖానా గ్రౌండ్స్ మధ్య ఫ్లై ఓవర్ నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గమని వివరించడం జరిగిందన్నారు.

హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ జిల్లాకు వెళ్ళే దారి లేదని,అంబర్ పేట 6 – నంబర్ జంక్షన్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉందని పేర్కొన్నారు. మెహిదిపట్నం నుంచి ఎయిర్ పోర్ట్ సహా మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లేందుకు పీవీ నర్సింహా రావు ఎక్స్ ప్రెస్ వే ఉందని, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, కేవలం సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు ట్రాఫిక్ నుంచి బయట పడి ప్రయాణం సాఫీగా కొనసాగించేందుకు మాత్రం ప్రత్యేకంగా మరో దారి లేదని సూచించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఒక్కటే పరిష్కారమని విన్నవించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఐదు జిల్లాల ప్రజలు సాఫీగా హైదారాబాద్ కు రాకపోకలు సాగించేందుకు, ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర బృందంతో కలిసి విన్నవించడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News