Tuesday, April 30, 2024

వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ పిటిషన్

- Advertisement -
- Advertisement -

 

Erra GangiReddy

న్యూఢిల్లీ:   మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ-1గా(ప్రధాన నిందితుడిగా) ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు గతంలో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ మొదట హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సిబిఐ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News