- Advertisement -
మేడ్చల్: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ దుండగుడు చోరీకి పాల్పడిన సంఘటన జిల్లాలోని మేడిపల్లి ఐఐసిటి కాలనీ అధ్యక్షుడు బి.పి.చారి ఇంట్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. టూలెట్ బోర్డు చూసి ఇల్లు అద్దెకు కావాలంటూ దుండగుడు లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళకు మత్తుమందు ఇచ్చిన ఆగంతుకుడు మెడలోని పుస్తెలతాడు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటనలో మహిళ స్పృహకోల్పోయి కిందపడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రస్తుతం దుండగుడి కోసం గాలింపుచర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Chain snatching case registered at Medchal
- Advertisement -