అమరావతి: కడప జిల్లాలోని మద్దనూరులో దారుణం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాలు దొంగిలించాడని నెపంతో డ్రైవర్ ను చెట్టుకు కట్టేసిన యాజమాని విచక్షణారహితంగా కొడుతూ.. చిత్రహింసలు చేశాడు. విరాల్లోకి వెళితే… గురునాథ్ ట్రాన్స్పోర్ట్ యజమాని ముద్దనుర్ నుంచి కర్నాటకకు సిమెంట్ ట్రాన్స్ పోర్ట్ నడుపుతున్నాడు. అతని దగ్గర కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సిమెంట్ లోడ్ తీసుకెళ్లిన డ్రైవర్ కొన్ని బస్తాల సిమెంట్ దొంగిలించాడని ట్రాన్స్పోర్టులో పనిచేసే మరికొందరు డ్రైవర్లు అతడిని కట్టేసి దారుణంగా చికతబాదారు. తనేమి చేయలేదని వేడుకున్నా పట్టించుకోలేదు. తోటి డ్రైవర్లే తనను కొట్టడంతో మనస్తాపం చెందిన అతను ప్రస్తుతం కనబడకుండా పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని డ్రైవర్ ఎక్కడికి వెళ్లాడనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Transport Owner Beaten Lorry Driver At Kadapa