Sunday, April 28, 2024

నాలుగు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం

- Advertisement -
- Advertisement -

Chance of rain in several districts for four days

హైదరాబాద్: ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాల మీదుగా మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు తూర్పు పడమర ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు రోజుపాటు వర్షాలు కురవనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జూలై 3వ తేదీ వరకు పలు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వర్షాపాతం అధికంగా నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు (శుక్రవారం) మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News