Thursday, May 2, 2024

అందుమా…చంద్రమా

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాల చూపంతా ఇప్పుడు మన చంద్రయాన్-3 మీదే కేంద్రీకృతమైంది. అన్నీ సజావుగా జరిగితే బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామ దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా దిగుతుంది. చందమామపైకి మనిషిని సైతం పంపానని గొప్పలు పోతున్న అమెరికా గానీ, అంతరిక్ష రంగంలో మనకన్నా ఎంతో ముందున్న రష్యా, చైనా గానీ ఈ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యే సాహసం చేయలేదు. చంద్రయాన్-3 కన్నా ముందే చంద్రుడిని చేరుకోవాలని హడావుడిగా రష్యా పంపిన లూనా-25 విఫలం కావడంతో విక్రమ్ ల్యాండింగ్‌పై ప్రపంచానికి ఆసక్తి పెరిగింది.

బెంగళూరు: రోదసీ రంగ చరిత్రలో నేడు భారత్‌కు అ త్యంత కీలకమైన రోజు. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ భారతీయులతో పాటు ప్రపంచ దేశాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా రు. చంద్రుడిపై పరిశోధనలకుగా అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 లక్షం తుది అంకానికి చేరుకుం ది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపురూ ప ఘట్టం ఆవిష్కృతమయ్యేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది. అ యితే ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్‌కు నిరంతర తనిఖీలు చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్టు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ఆరంభిస్తామని వివరించింది. బుధవారం సా యంత్రం సుమారు 5.45 గంటల తరువాత ఈ ప్రక్రియ మొదలు కానున్నట్టు అంచనా వేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ‘17 నిమిషాల టె ర్రర్ ’గా ఇస్రో అధికారులు, నిపుణులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైనది. సరైన ఎత్తులో సరైన స మయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్‌లను మండించుకోవాల్సి ఉంటుం ది. ఆ తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశా న్ని స్కాన్ చేసుకుంటుంది. ఇదంతా ల్యాండర్ స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది. అనువైన చోట దిగుతుంది. రూ.600కోట్ల ఖర్చుతో చేపట్టిన చంద్రయాన్3 మిషన్ ను జూలై 14న ఇస్రో ఎల్‌విఎం3 రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన సంగతి తెలిసిందే. సరిగ్గా 41 రోజుల తర్వాత లక్ష్యాన్ని చేరుకోనుంది. మరోవైపు బుధవారంనాటి సా ఫ్ట్ ల్యాండింగ్ ప్రకియను అన్ని పాఠశాలల విద్యార్థులు చూసేలా ఏర్పాట్లు చేయాలని ఇస్రో సూచించింది. భవిష్యత్‌లో పిల్లలు పరిశోధనల వైపు మళ్లేలా ఆసక్తిని రేకెత్తిస్తుందని అభిప్రాయపడింది. ఇస్రో సూచన మేరకు పలు రాష్ట్రాలకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. యూపీలో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు.
ల్యాండింగ్ ప్రక్రియ ఇలా…
ల్యాండర్ మాడ్యూల్‌లో పారామీటర్లు అన్నింటినీ తని ఖీ చేసి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరు లోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ నుంచి ఇస్రో సంబంధిత కమాండర్లను ల్యాండర్ మాడ్యూల్‌కు అప్‌లోడ్ చేస్తుంది. షెడ్యూల్ ల్యాండింగ్‌కు రెండు గంట ల ముందు ఇది జరుగుతుంది.

*సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కిమీ ఎత్తులోల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగు పె డుతుంది. ఇక్కడి నుంచి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతాయి.

*జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్ త న నాలుగు ఇంజిన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ల్యాండర్ కు ప్పకూలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

*జాబిల్లి ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్ వే గం సెకనుకు 1.68 కిమీలుగా ఉంటుంది. ఒక విమానం వేగం కంటే ఇది 10 రెట్లు ఎక్కువ.

*జాబిల్లి ఉపరితలానికి 6.8 కిమీల ఎత్తుకు చేరుకున్న త రువాత ల్యాండర్ తన రెండు ఇంజిన్లను ఆఫ్ చేసి, మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంటుంది. రివర్స్ థ్రస్ట్‌తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

*అప్పటికీ ల్యాండర్ ఇంకా జాబిల్లి ఉపరితలానికి స మాంతరంగానే ఉంటుంది. దీన్ని ‘రఫ్ బ్రేకింగ్ దశ’ అం టారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగుతుంది.

*ఆ తర్వాత ల్యాండర్ ‘ఫైన్ బ్రేకింగ్’ దశ లోకి అడుగు పెడుతుంది. ఇక్కడ చంద్రయాన్ 3 90 డిగ్రీలు వంపు తిరుగుతుంది. అప్పుడు చంద్రుడి ఉపరితలంపైనిలువు స్థానానికి వస్తుంది. గతంలో ఇక్కడే చంద్రయాన్ 2 ని యంత్రణ కోల్పోయి క్రాష్ అయింది.

*అలా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూఏ జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తరువాత ల్యాండర్ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు తగ్గుతాయి. అప్పుడు ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుంది.

*ఆ తర్వాత ల్యాండర్ మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు వస్తుంది. అప్పుడు మరోసారి ల్యాండింగ్ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం వెతుకుతుంది.

*అన్నీ అనుకూలంగా కన్పిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెడుతుంది. అప్పుడు దాని కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉంటాయి.

*ల్యాండర్ కాళ్లకు అమర్చిన సెన్సార్లు, జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తరువాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఆ 17 నిమిషాల టెన్షన్‌కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది.

*ల్యాండర్ జాబిల్లిపై దిగిన తర్వాత దాని ఒక తలుపు తెరుచుకుంటుంది. అందులో నుంచి రోవర్ జారుకుంటూ కిందకు వస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది. ల్యాండర్, రోవర్ మొ త్తం 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయని ఇస్రో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News