Thursday, May 2, 2024

భౌరంపేట ఓఆర్ఆర్ వద్ద చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

భౌరంపేట: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని భౌరంపేట ఓఆర్ఆర్ వద్ద బుధవారం చిరుత కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న సిసి కెమెరాల్లో చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకుని భౌరంపేట ఓఆర్ఆర్ పరిసరాలను అధికారులు పరిశీలించారు. ఘటనాస్థలిలో పాదముద్రలను గుర్తించారు. పాదముద్రలు చిరుతవా? కాదా? అని అధికారులు పరిశీలించారు. అనంతరం పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News