Tuesday, May 14, 2024

చెన్నై లక్ష్యం 158

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ముంబయి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఉంచింది. రవీంద్ర జడేజా, శాంట్నార్ వరసగా వికెట్లు తీస్తు ముంబయి ఇండియన్స్ వెన్నువిరిచారు. ముంబయి బ్యాట్స్‌మెన్లలో ఇషాన్ కిషన్ (32), టిమ్ డెవిడ్ (31), తిలక్ వర్మ(22), రోహిత్ శర్మ(21), హృతిక్ శోకెన్ (18 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (12), పియూష్ చావ్లా(05, నాటౌట్), టిస్టన్ స్టబ్స్(05), అర్షద్ ఖాన్ (01), సూర్యకుమార్ యాదవ్ (01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, తుషార్ దేశ్‌పాండే, మిచెల్ శాంట్నార్ చెరో రెండు వికెట్లు, సిసిందా మగలా ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News