Sunday, April 28, 2024

ఐదో వికెట్ కోల్పోయిన ముంబయి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ముంబయి పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అర్షద్ ఖాన్ రెండు పరుగులు చేసి శాంట్నార్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. కామెరూన్ గ్రీన్ 12 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ రూపంలో ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగు చేసి శాంట్నార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 32 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ప్రీటోరయస్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. రోహిత్ శర్మ 13 బంతుల్లో 21 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (06), టిమ్ డెవిడ్(02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News