Sunday, April 28, 2024

మార్గదర్శి కేసు.. శైలజా కిరణ్‌ను 10 గంటల పాటు ప్రశ్నించిన సిఐడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మార్గదర్శి కేసులో సిఐడి విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఎ2గా ఉన్న మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌ను మంగళవారం సుదర్ఘీంగా విచారించారు. మంగళవారం ఉదయమే శైలజా కిరణ్ ఇంటికి చేరుకున్న అధికారులు దాదాపు 10 గంటల పాటు ఆమెను విచారించారు. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని సిఐడి అధికారులు వీడియో రికార్డు చేశారు. గతంలో శైలజపై సిఐడి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా తెలంగాణ హైకోర్టు వాటిని రద్దు చేసింది. ఎపి సిఐడి అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రామోజీ రావు నివాసంలో విచారణ జరిపారు. కొద్ది రోజుల కిందటే మార్గదర్శి కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్‌కు చెందిన రామోజీరావు ఆస్తులను అటాచ్ చేసేందుకు సిఐడి ఎపి హోంశాఖ అనుమతి ఇచ్చింది.

ఇప్పటికిప్పుడు ఖాతాదారులకు డబ్బులు చెల్లించే స్థితిలో మార్గదర్శి లేదని అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రజాప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. రామోజీరావుకు చెందిన రూ. 793.50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసేందుకు ఎపి సిఐడికి అనుమతి లభించింది. నగదు, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నిధులు, మ్యూచువల్ ఫండ్స్‌లో డిపాజిట్లను అటాచ్ నిర్ణయం తీసుకున్నట్టు ఎపి సిఐడి ఓ ప్రకటనలో తెలిపింది. వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడం, నిధులు మళ్లించడం, ఐటీ చట్ట ఉల్లంఘనలకు మార్గదర్శి పాల్పడిందని అభియోగాలు సిఐడి మోపింది. ఎపిలో 37 బ్రాంచ్‌ల్లో మార్గదర్శి వ్యాపారాలు చేస్తోంది. 1989 చిట్స్ గ్రూప్స్ ఉన్నాయి. తెలంగాణలో 2,316 గ్రూప్స్ నడుస్తున్నాయి అని సిఐడి పేర్కొంది. ఇప్పటికే మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ సంస్థలో సిఐడి తనిఖీలు చేసింది.

కేసులు నమోదు చేసింది. మార్గదర్శి కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్‌గా పేర్కొంది. ఫోర్‌మెన్, ఆడిటర్లతో కలిసి కుట్రకు పాల్పడినట్టు సిఐడి తెలిపింది. చిట్స్‌ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. అక్రమాలు జరిగాయన్న ఆరోప ణలతో పలు మార్లు ఆ సంస్థ కార్యాలయాల్లో సిఐడి సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపిసి 120(బి), 409, 420, 477(ఏ), రెడ్ విత 34కింద ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఎపి ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999లో సెక్షన్ 5 తో పాటు చిట్ ఫండ్ యాక్ట్ 1982లోని 76,79సెక్షన్ల ప్రకారం సోదాలు నిర్వహించింది. మార్గదర్శి మేనేజర్లను అరెస్టు చేసింది. రామోజీరావు, శైలజాకిరణ్‌ను ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News