Friday, June 20, 2025

ఎవరి నీరు వారిది.. ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం: బనకచర్లపై చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

గోదావరి బెసిన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుండటంపై ఎపి సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడతూ.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవపడ్డానా?.. వాళ్లతో పోరాటం ఎందుకు? అని అన్నారు. మీరు కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండిని.. మిగిలిన నీటినే తాము వాడుకుంటామని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదని.. ఎవరి నీరు వారిదన్నారు. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందామని, సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందామని చంద్రబాబు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News