Thursday, May 2, 2024

నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

 

KCR inaugurates Nizamabad Collectorate

నిజామాబాద్: కొత్తగా నిర్మించిన నిజామాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల్లో సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్లను నిర్మించేందుకు నిర్ణయించిన విషయం విధితమే. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించింది. ఇటీవల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రాగా..సిఎం కెసిఆర్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ సి నారాయణరెడ్డిని కూర్చుండబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి.. శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన సిఎం కెసిఆర్‌కు అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు. కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సిఎస్‌ సోమేశ్‌కుమార్‌, సిఎంవో అధికారి స్మితా సబర్వాల్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News