Friday, May 3, 2024

కోలపూడి ప్రసాద్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns the death of Kolapudi Prasad

హైదరాబాద్: ఎంబిసి సిద్దాంతకర్త, సామాజిక అభ్యుదయవాది, కోలపూడి ప్రసాద్ (కోప్రా) మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తను నమ్మిన విలువల కోసం అహర్నిషలు పాటుపడిన కోప్రా మరణంతో, అత్యంత వెనుకబడిన వర్గాలు తమలో ఒక గొప్ప మేథావిని కోల్పోయినట్టయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోల‌పూడి ప్ర‌సాద్ స్వస్థలం నెల్లూరు జిల్లా. కోప్రాకు భార్య నిర్మ‌ల‌, ఒక కూతురు ఉన్నారు. గ‌త కొంత‌కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మెద‌డు ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డకట్టి ఆయన మృతిచెందినట్టు కుటుంబస‌భ్యులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News