Friday, May 17, 2024

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పిసి కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to family of PC who died in road accident

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆర్థిక సాయం అందజేశారు. చౌటుప్పల్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జగన్నాథం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కానిస్టేబుల్ భార్య లలితకు పోలీస్ వెల్ఫేర్ నుంచి వచ్చిన రూ.5లక్షల పదివేల చెక్కును సిపి మహేష్ భగవత్ అందజేశారు. గతంలో భద్రత నుంచి వచ్చిన రూ.8లక్షలను అందజేశారు. మిగతా బెనిఫిట్స్, పెన్షన్‌ను వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం త్వరగా వచ్చేలా చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News