Monday, May 20, 2024

18న మేడారం జాతరకు సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

CM KCR to visit Medaram Jatara on Feb 18th

హైదరాబాద్: ఈ నెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా మేడారం జారతకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సోమవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ చెప్పారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని, రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరను విజయవంతం చేయాలని కోరారు. మేడారంకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు.

మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గతంలో 3,300 బస్సులను జాతరకు నడపగా.. ఈసారి మరో 500 బస్సులను పెంచామని, మొత్తం 3800 బస్సులు నడపనున్నామని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలకు సమీపంలో దిగుతారని చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

CM KCR to visit Medaram Jatara on Feb 18th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News