Thursday, June 19, 2025

అనాడు కెసిఆర్ చేసిన సంతకం.. ఇప్పుడు పెద్ద ప్రతిబంధకంగా మారింది: సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై జరిగిన సమావేశం అనంతరం సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్శంగా ఆయన 21.9.2016 నాడు కేంద్రప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిదని.. ఆ సమావేశంలో 3 వేల టిఎంసిల నీరు వృథాగా గోదావరిలో కలుస్తోందని కెసిఆర్ అన్నారని పేర్కొన్నారు. 2019 అక్టోబర్‌లో కెసిఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఆలోచనకు ఆనాడే బీజం పడిందని అన్నారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కెసిఆర్ చెప్పినట్లు సమస్తే తెలంగాణలో రాశారని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలో ఉందని అన్నారు.

రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఎపి మంత్రులు మీడియాకు చెప్పారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఆనాడు సిఎం కెసిఆర్ చెప్పిన అంశాలే నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏ అనుమతి లేకుండా ఎపి ముందుకెళ్లడాన్ని పార్లమెంట్‌లో ఖండిస్తామని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. గోదావరి-బనకచర్లను వ్యతిరేకిస్తూ.. తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకొని ఈ అంశంపై పోరాటం చేస్తామన్నారు. తెలంగాణకు కృష్ణాలో 299 టిఎంసిలు సరిపోతాయని ఆనాడు కెసిఆర్ ఒప్పుకొని సంతకం చేశారని గుర్తు చేశారు. అది ఇప్పుడు తెలంగాణకు పెద్ద ప్రతిబంధకంగా మారిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News