Thursday, June 19, 2025

కెసిఆర్, జగన్ కలిసి బనకచర్లకు బీజం

- Advertisement -
- Advertisement -

ప్రగతిభవన్‌లో నాటి రెండు రాష్ట్రాల సిఎంలు పలుమార్లు భేటీ అయ్యారు
రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు ప్రణాళికలు అప్పుడే
రూపొందించారు 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే
ఇందుకు బీజం పడింది బేసిన్లు లేవు..భేషజాలు లేవన్న కెసిఆర్ ఎపికి
400 టిఎంసిలు తరలించుకుపోవడానికి అంగీకరించారు కేంద్ర మంత్రి
కిషన్‌రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు అఖిలపక్షానికి రాకుండా ముందుగానే
కేంద్ర జలశక్తిమంత్రిని ఆయన కలవడం అనుమానాలు రేకెత్తిస్తోంది
రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం బనకచర్లపై రాజకీయ పోరాటం
ఫలించకపోతే న్యాయ పోరాటం కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదు
30వ తేదీలోగా కాళేశ్వరం కమిషన్‌కు మినిట్స్ పంపిస్తాం
సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్ : బీఆరెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాల ను ప్రచారం చేస్తున్నారని, ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా అబద్దాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించా రు. బుధవారం సచివాలయంలో ఎంపీల సమావేశం తదుపరి సిఎం మీడియాతో మాట్లాడారు. ముందుగా గతంలో మాజీ సిఎం కెసిఆర్ ఏపి సిఎం జగన్‌మోహన్ రెడ్డితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిని వీడియో క్లిప్పింగ్స్, అ సెంబ్లీలో కెసిఆర్ చేసిన ప్రసంగం వీడియో క్లి ప్పింగ్స్‌ను ప్రదర్శించారు. అధికారంలో ఉన్నప్పు డు ఎలా మాట్లాడారు.. కోల్పోయాక ఎలా మా ట్లాడుతున్నారో వివరించదలచుకున్నానంటూ వాళ్లు సెంటిమెంట్ తో మళ్లీ పార్టీని బ్రతికించుకు నే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవచేశారు. రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు ఆనా డు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న కెసీఆర్, హరీష్ రావు
సంపూర్ణ అవగాహన తో

ప్రభుత్వానికి సహకరించినా, సూచనలు చేసి నా స్వీకరిస్తామని, కానీ వారు దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు చే స్తున్నారని సిఎం విమర్శించారు. -2016 సెప్టెంబర్ 21వ తేదీన ఢిల్లీ శ్రమ శక్తి భవన్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు, ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరైన ఆ సమావేశంలో ఎనిమిది పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారు, అందులో ఆరవ పేజీలోని రెండవ పేరాలో ఉన్న వివరాలను సిఎం చదివి వినిపించారు. ఆ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సాగునీటి సమస్యలు ప్రస్తావనకు వచ్చినప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి సిఎం కెసిఆర్ మూడు వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ప్రతిపాదన పెట్టారు. రాయలసీమకు గో దావరి నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే పునా ది పడిందన్నారు.

ఈ మీటింగ్ మినిట్స్ మాజీ మంత్రి హరీష్ రావుకు పంపిస్తానన్నారు. 2019 వరకు ఇది రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చిందని, 2019 లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో నాలుగుసార్లు సమావేశమై కెసీఆర్ రాయలసీమకు నీటి తరలిపునకు నిర్ణయం తీసుకున్నారని, ఆ సమావేశం వివరాలను ఆనాటి ఇరురాష్ట్రాల మంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరించినట్లు దినపత్రికల్లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆనాడు కెసిఆర్ మాట్లాడారని, గోదావరి- బనకచర్ల విషయంలో 2016 లో కెసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకువెళుతోందన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కెసిఆర్ ఆనాడు మాట్లాడారని తెలిపారు. ఎపి ప్రభుత్వం చేపట్టేది 200 టిఎంసి ప్రాజెక్టు కాదు 300 టిఎంసిల కోసమని, ఆనాడు కెసిఆర్ 400 టిఎంసిలు తీసుకోవచ్చని అంగీకరించారని తెలిపారు.

నష్ట నివారణకు చర్యలు తీసుకున్నాం
తమ ప్రభుత్వం వాదనలకు వెళ్లదలచుకోలేదని, బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు నష్టం జరగొద్దని జలశక్తి మంత్రిత్వశాఖకు పిర్యాదు చేశామని, తమ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేవారు. వారి హయాంలో జరిగిన వాటిని కప్పిపుచ్చేందుకు ఉన్నఫలంగా హరీష్‌రావు బకెట్లో బురద తీసుకుని మాపై చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ పాపానికి కారకుడు మీ మామ కెసిఆరే అని హరిష్‌రావుకు సూచించారు. మీరు పాపాల భైరవులు, కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్లకు కక్కుర్తి పడి కుట్రలు చేశారని, ఇప్పుడు బిఆర్‌ఎస్ అధికారంలో లేదని ఆ బురద మాపై చల్లాలని చూస్తున్నారని ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ నాయకులు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడలేదని, పాలమూరు జిల్లాల్లో మొదలైన ఏ ప్రాజెక్టును వారి హయాంలో పూర్తిచేయలేదని విమర్శించారు. పదేళ్లలో పెండింగ్ లోనున్న ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుతో గ్రావిటీతో సాగునీరు అందేదన్నారు. కమిషన్ల కక్కుర్తితో లక్షకోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందివ్వలేదని, పదేళ్లు రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గాలికి వదిలేశారని విమర్శించారు.

రాష్ట్రాన్ని దోచుకున్నారు
పదేండ్లు అధికారంలో ఉండి వాళ్ల ఇండ్లు నింపుకునేందుకు రాష్ట్రాన్ని దోచుకున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. కానీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, తాము కష్టపడి ఎస్‌ఎల్బీసీ పనులు ప్రారంభిస్తే మనుషులు చనిపోతే వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఎక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళ ముఖాల్లో పైశాచిక ఆనందం కనిపిస్తోందన్నారు.
తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ?
మాజీ మంత్రి హరీష్ రావు హుందాగా వ్యవహరించాలని, అబద్ధాలతో కాలం వెళ్లదీయొద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు. ఇవాళ మేం నిజాలు బయటపెట్టాం.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, మూసీ ప్రక్షాళన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుసుకోవొద్దా ?మీరు నిధులు ఇస్తామంటే చెప్పండి మేము మీ ఫామ్ హౌస్ కే వస్తాం.. రూ.50 వేల కోట్లు ఇవ్వండి.. ప్రభుత్వం తరపున బాండ్లు సమర్పిస్తామని సిఎం అన్నారు.

అబద్ధాలతో బతుకు సాగదీయొద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని సిఎం అన్నారు. ఈ విషయంలో మాకు ఎలాంటి శష-భిషలు లేవు.. సామ, దాన, దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నామని స్పష్టం చేశారు. అందరినీ కలిసి సమస్యలను వివరిస్తామని, అయినా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రక్రియలను అనుసరిస్తూ కేంద్రానికి సమస్యలను వివరిస్తోందన్నారు.
పలుకుబడి ఉంటే సరిపోదు
కేంద్రంలో పలుకుబడి ఉందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అనుకుంటే అది మీ భ్రమ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు తమకు ప్రణాళిక ఉందని, చంద్రబాబునాయుడు, కెసిఆర్ చెప్పారని కాదు.. గోదావరి బేసిన్ లో మూడువేల టిఎంసిలు మిగులు జలాలు ఉన్నాయని మీరు నమ్మితే 968 టిఎంసిలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇచ్చాక మీరు మిగులు జలాలు తీసుకోండని ఎపి సిఎంకు సూచించారు.

కేసిఆర్ ద్రోహం చేశారు
మాజీ సిఎం కెసీఆర్ తెలంగాణకు చేసిన తీరని ద్రోహం వల్లే ఎపికి నీళ్లు వెళుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. మేడిగడ్డ గుండెకాయ లాంటిదని, అది లేకపోతే ఆ ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేదన్నారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కృష్ణానది జలాలు జూరాలలో తెలంగాణకు వస్తాయి, ఆ నీటిని వాడుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. దీనికి కారణం కెసిఆర్ కాదా ? రాయలసీమ ప్రాజెక్టులకు ఒప్పుకున్నది మీరే కదా ? అని నిలదీశారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎపి సిఎం చంద్రబాబునాయుడు అవసరం ఉంది, చంద్రబాబుకి గోదావరి జలాల అవసరం ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు, మోదీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంత మాత్రాన మీ ప్రాజెక్టులు పూర్తికావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎపి సిఎంను హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News