Sunday, April 28, 2024

మట్టంపల్లి నృసింహుని దర్శించుకున్న కలెక్టర్ వెంకటరావు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: మఠంపల్లి మండల పరిదిలోని మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటరావు,అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డిలు శనివారం దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘణస్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.

స్వామి వారి చిత్రపటానికి బహూకరించి శేష వసాలతో ఆశీర్వచనాలు అందజేశారు. కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ సూర్యపేట జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి మట్టపల్లి నృసింహుని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నా రు.ఆయనవెంట ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్,మట్టపల్లిరావు,తహశీల్దార్ సాయాగౌడ్, ఆలయ అర్చకులు,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News