Sunday, September 21, 2025

బాత్రూం మేకుకు వైరు బిగించి…బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారధి నగర్ కు చెందిన షేక్ జాన్ పాషా( 38 ) అనే వ్యక్తి బాత్రూంలో మేకుకు వైరు బిగించుకొని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్ళగా అతడు అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖమ్మం ఎస్ఐ రఫీ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News