Tuesday, April 30, 2024

బిజెపి అబద్దాలకు.. ఫేక్ ప్రచారానికి కేరాఫ్ అడ్రస్..

- Advertisement -
- Advertisement -

Congress And bjp leaders joined in TRS

హైదరాబాద్: మంత్రి హరీష్ రావు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం అంటూ ఆయన సమక్షంలో నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ వి పగటి కలలు, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిందని మంత్రి హరీశ్ విమర్శించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కాంగ్రెస్ , బిజేపీ పార్టీల నుండి పలువురు నాయకులు, యువకులు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… రెండు జాతీయ పార్టీలు నాటి నుండి నేటి వరకు తెలంగాణ కు అన్యాయం చేస్తునాయన్నారు. నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చెస్తే నేడు స్వరాష్ట్రం లో కేంద్రంలోని బిజెపి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మన పథకాలు కాపీ కొట్టి మేమే చేసాం అని అబద్దాలు ఆడుతూ,ఫెక్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బిజెపి ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు. ఇక తెలంగాణ లో కాంగ్రెస్ కనుమరుగైన పార్టీ అని, కాంగ్రెస్ నేతలవి పగటి కలలన్నారు.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ప్రజల ఇంటి పార్టీ టిఆర్ఎస్ఏనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ ఒక స్వర్ణయుగం అని దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే.. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే నేను మంత్రిగా లేకుంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా.. సిద్దిపేటకు సాగు, త్రాగు నీరు వచ్చేదా అని అన్నారు. స్వరాష్ట్రం వల్లనే దేశంలో నే ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేట పేరు నిలిచింది. సిద్దిపేటను జిల్లా చేస్కున్నము. సాగు త్రాగు నీటి కలను నెరవేర్చినం. కొద్దీ రోజుల్లోనే రైలు రాబోతుంది. సిద్దిపేట సమగ్ర అభివృద్ధి ప్రజలు కోరుకున్న అభివృద్ధి ని చేసి చూపెట్టినం అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై, మేము అభివృద్ధి భాగస్వామ్యం అవుతాం అంటూ బీజేపీ, కాంగ్రెస్ నుండి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అని పేర్కొన్నారు. అందరికి పార్టీ లో సముచిత స్థానం కలిపిస్తానని చెప్పారు. పార్టీలో వచ్చిన 30 మందిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

అభివృద్ధి కి ఆకర్షితులై…అభివృద్ధి భాగస్వామ్యం 

టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీ లకు చెందిన పలువురు నేతలు..

సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే హరీశ్ రావు.. సిద్దిపేట నియోజకవర్గం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. మంత్రి హరీష్ రావు అభివృద్ధి మార్క్ కు ఇది ఒక నిదర్శనమని పార్టీలో చేరిన రాజ్ గోపాల్ పేట కు చెందిన బీజేపీ మహిళ మోర్చా గ్రామ శాఖ అధ్యక్షురాలు నాంపల్లి కనకవ్వ , సుదగొని శ్రవణ్ కుమార్ టి ఎన్ ఎస్ ఎఫ్ మండల అధ్యక్షుడు , పరమన్ల గణేష్ -బిజెపి మండల కార్యదర్శి , శివరాత్రి బాబు తదితరులు అన్నారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమం 8 ఏళ్లలో సాధ్యం చేసి ప్రజల కళ్ళముందు ఉంచారని, ఇది సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు అభివృద్ధి మార్క్ అని వారు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గానికి హరిశ్ రావు లాంటి గొప్ప నాయకులు ఉన్నందుకు గర్వంగా ఉందని.. మేము ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట అంటే ఒక ప్రత్యేక గౌరవం , గుర్తింపు ఉంటుంది అంటే అది హరిశ్ రావు లాంటి నాయకుని వలనన్నారు.. అందుకే మేము హరిశ్ రావు గారి అభివృద్ధి లో ఆయనే వెంటే ఉంటూ సిద్దిపేటను మరింత అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతాం అని వారు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News