- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్ఎ బి.కృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో ఆసిఫ్నగర్ నియోజకవర్గ ఎంఎల్ఎగా, పార్లమెంబరీ సెక్రటరీగా ఆయన పనిచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట్లా పాల్గొన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. కృష్ణ మృతికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెరాస పార్లమెంటు సభ్యులు కె.కెశవరావు, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నియోజకవర్గంలో నిరంతరం ఎస్సీ, ఎస్టీల కోసం కృషి చేసినట్లు నేతలు పేర్కొన్నారు.
Congress former MLA B Krishna passes away
- Advertisement -