Tuesday, May 7, 2024

జానారెడ్డికి స్పెషల్ టాస్క్..!

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి స్పెషల్ టాస్క్ అప్పగింత!
టికెట్ రాని నేతలను బుజ్జగించే బాధత్య సమన్వయ కమిటీకి…
అసంతృప్తులను బుజ్జగించేందుకు నలుగురితో కమిటీని ఏర్పాటు చేసిన అధిష్టానం

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ స్పెషల్ టాస్క్ అప్పగించింది. అభ్యర్థుల లిస్టు అనంతరం బుజ్జగింపుల బాధ్యతను హైకమాండ్ ఆయనపై ఉంచింది. గతంలో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను పరిష్కరించడంలో జానారెడ్డి సఫలమైనట్లు ఏఐసిసి బలంగా నమ్ముతోంది. దీంతో కొత్త బాధ్యతలతో ప్రత్యేకంగా ఫోర్ మెన్ కమిటీని (సమన్వయ కమిటీని) ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించేందుకు ఈ కమిటీ క్రియాశీలంగా పనిచేయనుంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లతొ ఈ కమిటీ సంప్రదింపులు చేయనుంది.

ఏఐసిసికి కత్తి మీద సాములా…
రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చితే ఈ సారి అత్యధిక మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తుల నుంచి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ చేయనుంది. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎం పిక జరుగుతుంది. అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ, ఏఐసిసికి కత్తి మీద సాములా మారింది. స్క్రీనింగ్ కమిటీ మూడు సమావేశాలు జరిపినా ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో టికెట్ల ఎంపిక తర్వాత మిగతా అసంతృప్తులు పార్టీ నుంచి చేజారిపోకుండా జానారెడ్డి కమిటీ బుజ్జగింపులు చేసి భరోసా కల్పించనుంది.

రాష్ట్ర స్థాయి నేతలతోనే ఇబ్బందులు….
టికెట్ రాని నేతలకు స్థాయిని బట్టి భరోసా కల్పించాలని ఫోర్ మెన్ కమిటీ తీర్మానించింది. ఒకవేళ ఎంపిటిసి, జడ్పీటిసి పోస్టుల్లో పనిచేసే వారు టికెట్ ఆశిస్తే కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చాక ఆయా పరిధిలో నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నమ్మకం కల్పించడం. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి లీడర్లకు స్టేట్ కేడర్ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఈ ఫోర్ మెన్ కమిటీ బుజ్జగించనుంది. కర్ణాటక మంత్రి బోసురాజు అంశాన్ని ప్రస్తావిస్తూ అసంతృప్తులను కాంప్రమైజ్ చేయనున్నారు. అయితే స్థానిక సంస్థల్లో పనిచేసిన లీడర్లు కమిటీతో కాంప్రమైజ్ అయినా రాష్ట్రస్థాయిలో పేరొందిన నేతలు అంత సులువుగా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదనేన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News