Thursday, May 2, 2024

హింసాత్మకంగా ఘటనలను కాంగ్రెస్ ప్రేరేపిస్తుంది: బిఆర్‌ఎస్ లీగల్ సెల్ నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ న్యాయ విభాగం,  టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బిఆర్‌ఎస్‌ను కించపరిచే విధంగా ఉన్న కాంగ్రెస్ ప్రకటనలను నిలిపివేయాలని మరోసారి లీగల్ టీం కోరింది. అనంతరం బీఆర్‌ఎస్ లీగల్ బృందం నేత సోమా భరత్ మాట్లాడుతూ పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపిస్తూ క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట దుస్సంఘటనలు జరిగాయని, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్‌గానే ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థలపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. పదేళ్లుగా బిఆర్‌ఎస్ పాలనలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలను ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రేవంత్‌కు టిడిపి తల్లి పార్టీ అయితే కాంగ్రెస్ అత్త పార్టీ అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి టిడిపి పార్టీ అంతర్గత ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యలు చేశారు. స్టార్ క్యాంపెనియర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలని హితవుపలికారు. ఎంసిసి కమిటీకి చూపించిన ప్రకటన ఒకటి బయట ప్రచారం మరొకటి చేస్తున్నారన్నారు. ఏదైనా అనుమానం ఉన్న అంశాలపై ఈసి స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News