Sunday, April 28, 2024

మహబూబ్ నగర్ లో దారుణం.. సిఐ మర్మాంగాన్ని కోసిన కానిస్టేబుల్..

- Advertisement -
- Advertisement -

కానిస్టేబుల్.. సిఐపై దాడి చేసి అతని మర్మాంగాన్ని కోసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పని చేస్తున్నఇఫ్తార్ అహ్మద్ పై.. మరో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిఐని చికిత్స కోసం హుటాహుటిన స్థానిక ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి సీరియస్ గా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు సమాచారం.

కానిస్టేబుల్ భార్యతో సిఐ వివాహేతర సంబంధం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News