Monday, May 13, 2024

మరో 1,36,225 మందికి టీకా

- Advertisement -
- Advertisement -

Corona vaccine for another 136225 people in Telangana

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 1,36,225 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 96,209 మంది మొదటి డోసు తీసుకోగా, 40,016 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,00,895 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 2,11,253 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 3,11,086 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 1,40,736 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో పాటు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 44,44,124 మంది మొదటి, 1,16,802 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 51,16,687 మంది మొదటి, 13,23,219 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 101,72,792 మంది తొలి, 17,92,010 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. ఇక కొవిన్‌లో నమోదైన 102,26,800 డోసుల్లో 62,970 ఆర్మీకి కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌లో 105,27,548 డోసులు వినియోగించగా, వ్యాక్సిన్ వేస్టేజ్ -మైనస్ 3.62 శాతం తేలింది.

Corona vaccine for another 136225 people in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News