Thursday, May 2, 2024

సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం. రాష్ట్ర శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేస్తారు. సొంత జాగలు ఉన్న పేదలకు గృహ నిర్మాణానికి రూ. 3 లక్షల సాయం పథకం అమలు, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష, రైతుబంధు నిధుల విడుదల, నియోజకవర్గానికి 500 మంది దళితబంధు లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా గవర్నర్‌ స్థానంలో సీఎంను నియమించేందుకు వీలు కల్పించే బిల్లును శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

గత సెప్టెంబరు 13న రాష్ట్ర శాసనసభ, మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన ఎనిమిది బిల్లుల్లో ఏడింటిని గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టిన అంశంపైనా మంత్రిమండలిలో చర్చించనున్నారని తెలుస్తోంది. వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరుతూ తీర్మానం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాల దాడులు జరగడంపైనా మంత్రిమండలి చర్చించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News