- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి నామినేషన్ల సెంటర్లో భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ బుధవారం పరిశీలించారు. సరూర్నగర్, కాప్రా, మల్కాజ్గిరి, ఉప్పల్ కార్పొరేటర్ల నామినేషన్ కేంద్రాల్లోబందోబస్తును పరిశీలించారు. జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమైన సిపి ఎన్నికల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాల్సిన అడుగాలని ఎన్నికలకు కావాల్సిన భద్రత కల్పిస్తామని తెలిపారు. ప్రతి సెంటర్లో వీడియో తీయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి, ఇన్స్స్పెక్టర్లు పాల్గొన్నారు.
CP Mahesh Bhagwat inspects nominations centers
- Advertisement -