Sunday, April 28, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పోరాడారు

- Advertisement -
- Advertisement -

CP Sajjanar paying tribute to Konda Laxman Bapuji

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాడారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. గచ్బిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం కోండా లక్ష్మణ్‌బాపూజీ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ బాపూజీ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగ జరుపుకోవడం నిజమైన నివాళి అని అన్నారు.

బాపూజీ స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు రాష్ట్ర రోజుగా ప్రకటించిందని అన్నారు. బాపూజీ ఆదిలాబాద్ జిల్లా, వాంకిడి గ్రామంలో జన్మించారని, గాంధీ సిద్ధాంతాలను అనుసరించారని అన్నారు. నిజాం, రజాకార్ల అరాచకాలపై పోరాడారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పాటుపడ్డారని అన్నారు. బిదల కోసం న్యాయవాదిగా ఉచితంగా కోర్టుల్లో వాదించారని అన్నారు. కార్యక్రమంలో ఎడిసిపి మాణిక్‌రాజ్, ఎసిపి లక్ష్మినారాయణ, ఎసిపి సంతోష్‌కుమార్, ఇన్స్‌స్పెక్టర్ రామచంద్ర రెడ్డి, ఆర్‌ఐలు పాల్గొన్నారు. రాచకొండలో… కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మల్కాజ్‌గిరి డిసిపి రక్షిత మూర్తి, పోలీసులు ఘనంగా నివాళులర్పించారు.

CP Sajjanar paying tribute to Konda Laxman Bapuji

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News