Saturday, April 27, 2024

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం సమీపంలో ఉన్న భద్రతా పోస్టు వద్ద ఒక సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు.

ఐబి డైరెక్టర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన గార్డు పోస్టులో 33 ఏళ్ల ఎఎస్‌ఐ రాజ్‌బీర్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News