Monday, April 29, 2024

అడ్డుకున్న దళిత మహిళను తన్నుకుంటూ వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చెల్ కాంగ్రెస్ కార్యాలయంలో టికెట్ల గందరగోళం నెలకొంది. ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఎంపి రేవంత్ రెడ్డిని దళిత మహిళ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేడ్చల్ కాంగ్రెస్ బీఫారం విషయంలో 21 వార్డులలో పానుగంటి సత్తయ్యకు బీఫారం ఇవ్వాలని ఓ దళిత మహిళ మోకాళ్ల మీద కూర్చొని రేవంత్ రెడ్డిని అడ్డుకుంది. అయితే రేవంత్ ఆ మహిళను పట్టించుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రేవంత్ తనని తన్నుకుంటూ వెళ్లాడని.. మేడ్చల్ కాంగ్రెస్ లో దళితులను అనగదొక్కుతున్నారని, మేడ్చెల్ కాంగ్రెస్ కార్యాలయం రెడ్డీల కాంగ్రెస్ పార్టీగా మారిందని, ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చి అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది.

Dalit Woman fire on MP Revanth Reddy in Medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News